ముజీబ్ ను సన్మానించిన టీఎన్జీవోస్  నేత రాజ్ కుమార్ 

ముజీబ్ ను సన్మానించిన టీఎన్జీవోస్  నేత రాజ్ కుమార్ 

విశ్వంభర, బషీర్ బాగ్ : హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ  యాదయ్య ఆదేశాల మేరకు పలువురు ఆఫీస్ సబార్డినేట్ (ఓఎస్) సిబ్బందికి జూనియర్ అసిస్టెంట్ (జేఆర్ అసిస్టెంట్) హోదాలో పదోన్నతులు కల్పించారు. పదోన్నతి పొందిన వారిలో డి. వసంత్‌ను జి హెచ్ ఎస్ రాజ్‌భవన్‌కు, కుట్టం రాజును డైట్ నేరెడ్‌మెట్‌కు, సీతారాంను జి హెచ్ ఎస్ ఎర్రమంజిల్‌కు, రాజును జి హెచ్ ఎస్ మంగళ్‌ఘాట్‌కు, ఐజాజ్‌ను జి.హెచ్.ఎస్ దారుల్‌షిఫాకు, సాయిని జి హెచ్ ఎస్ అంబర్‌పేట్‌కు జూనియర్ అసిస్టెంట్లుగా నియమించారు. అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో అబ్జార్బ్ అయిన వారిలో ఉమాపతి సింగ్‌ను జి జి హెచ్ ఎస్ వై మైసారం‌నకు, రోహిత్‌ను డైట్ నేరెడ్‌మెట్‌కు పోస్టింగ్ ఇచ్చారు. ఈ పదోన్నతి ఫైల్‌ను ఏడీ శ్రీనివాస్ రెడ్డి, సూపరింటెండెంట్ జి. రాజ్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్లు ఖాజా సోహైల్ అహ్మద్, ఫైయాజ్ అహ్మద్ సమర్థవంతంగా ప్రాసెస్ చేశారు. ఈ సందర్భంగా పదోన్నతుల కోసం విశేషంగా కృషి చేసిన టీఎన్జీవోస్  యూనియన్ సెంట్రల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎస్.ఎం. హుస్సైనీ ముజీబ్ ను టీఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ అసోసియేట్ ప్రెసిడెంట్ కె.ఆర్. రాజ్‌కుమార్  శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో  సెక్రెటరీ ఎం. భాస్కర్, ఉపాధ్యక్షుడు రుగేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫిరోజ్ అహ్మద్, పబ్లిక్ సెక్రటరీ రవి, ఫోరం ఆర్గనైజింగ్ సెక్రటరీ శేఖర్‌తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.

🕒 19 Jun 2026 ✍️ Desk

ముజీబ్ ను సన్మానించిన టీఎన్జీవోస్  నేత రాజ్ కుమార్ 

విశ్వంభర, బషీర్ బాగ్ : హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ  యాదయ్య ఆదేశాల మేరకు పలువురు ఆఫీస్ సబార్డినేట్ (ఓఎస్) సిబ్బందికి జూనియర్ అసిస్టెంట్ (జేఆర్ అసిస్టెంట్) హోదాలో పదోన్నతులు కల్పించారు. పదోన్నతి పొందిన వారిలో డి. వసంత్‌ను జి హెచ్ ఎస్ రాజ్‌భవన్‌కు, కుట్టం రాజును డైట్ నేరెడ్‌మెట్‌కు, సీతారాంను జి హెచ్ ఎస్ ఎర్రమంజిల్‌కు, రాజును జి హెచ్ ఎస్ మంగళ్‌ఘాట్‌కు, ఐజాజ్‌ను జి.హెచ్.ఎస్ దారుల్‌షిఫాకు, సాయిని జి హెచ్ ఎస్ అంబర్‌పేట్‌కు జూనియర్ అసిస్టెంట్లుగా నియమించారు. అలాగే జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లో అబ్జార్బ్ అయిన వారిలో ఉమాపతి సింగ్‌ను జి జి హెచ్ ఎస్ వై మైసారం‌నకు, రోహిత్‌ను డైట్ నేరెడ్‌మెట్‌కు పోస్టింగ్ ఇచ్చారు. ఈ పదోన్నతి ఫైల్‌ను ఏడీ శ్రీనివాస్ రెడ్డి, సూపరింటెండెంట్ జి. రాజ్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్లు ఖాజా సోహైల్ అహ్మద్, ఫైయాజ్ అహ్మద్ సమర్థవంతంగా ప్రాసెస్ చేశారు. ఈ సందర్భంగా పదోన్నతుల కోసం విశేషంగా కృషి చేసిన టీఎన్జీవోస్  యూనియన్ సెంట్రల్ జనరల్ సెక్రటరీ డాక్టర్ ఎస్.ఎం. హుస్సైనీ ముజీబ్ ను టీఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ అసోసియేట్ ప్రెసిడెంట్ కె.ఆర్. రాజ్‌కుమార్  శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో  సెక్రెటరీ ఎం. భాస్కర్, ఉపాధ్యక్షుడు రుగేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఫిరోజ్ అహ్మద్, పబ్లిక్ సెక్రటరీ రవి, ఫోరం ఆర్గనైజింగ్ సెక్రటరీ శేఖర్‌తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.

🔗 https://www.vishvambhara.com/telangana/tngos-leader-raj-kumar-honored-mujeeb/article-16740

Tags: