పాఠ్య పుస్తకాలు పంపిణీ. - జిల్లా విద్యాశాఖ అధికారి ఏ . సత్యనారాయణ మూర్తి .
విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల పూసపల్లి గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీ జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి సందర్శించారు . అనంతరం నూతన విద్యా సంవత్సరం 2026-2027 సంవత్సరానికి విద్యార్థిని , విద్యార్థులు చదువుకోవడానికి స్కూల్ ప్రధానో పాధ్యాయులు పూజారి వీరయ్య ఆధ్వర్యంలో పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు . ఈ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు , కల్పించి, విద్యార్థిని విద్యార్థులకు చక్కటి, ఆహ్లాదకర వాతావరణంలో, ఒత్తిడి లేని విద్యను, విద్యార్థులకు అందజేస్తుందని , అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలనే చదవాలని , విద్యార్థులు మంచిర్యాంకులు సాధించడానికి ఉపాధ్యాయుల సాహయ ,సహకారాలు ఉంటాయని , ఇంతటి చక్కటి అవకాశాన్ని విద్యార్థిని , విద్యార్థులు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు . నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే నోట్ బుక్స్ కూడా పంపిణీ చేశారని గుర్తు చేశారు . జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాల యందు 2025 -26 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో విద్యార్థిని విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచి, ఐఐటి బాసరలో సీట్లు సాధించారని ,
పాఠశాల నిర్వహణ యందు చక్కటి ప్రతిభను కనబరుస్తున్న ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందాని అభినందించారు . ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ ఎం వెంకటేశ్వర్లు, సీఎంఓ వి సురేష్, జెండర్ క్వాలిటీ కోఆర్డినేటర్ వై గాయత్రి, మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు .
పాఠ్య పుస్తకాలు పంపిణీ. - జిల్లా విద్యాశాఖ అధికారి ఏ . సత్యనారాయణ మూర్తి .
విశ్వంభర, మహబూబాబాద్ జిల్లా : మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల పూసపల్లి గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీ జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి సందర్శించారు . అనంతరం నూతన విద్యా సంవత్సరం 2026-2027 సంవత్సరానికి విద్యార్థిని , విద్యార్థులు చదువుకోవడానికి స్కూల్ ప్రధానో పాధ్యాయులు పూజారి వీరయ్య ఆధ్వర్యంలో పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు . ఈ పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులు , కల్పించి, విద్యార్థిని విద్యార్థులకు చక్కటి, ఆహ్లాదకర వాతావరణంలో, ఒత్తిడి లేని విద్యను, విద్యార్థులకు అందజేస్తుందని , అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలనే చదవాలని , విద్యార్థులు మంచిర్యాంకులు సాధించడానికి ఉపాధ్యాయుల సాహయ ,సహకారాలు ఉంటాయని , ఇంతటి చక్కటి అవకాశాన్ని విద్యార్థిని , విద్యార్థులు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు . నూతన విద్యా సంవత్సరం ప్రారంభం రోజునే నోట్ బుక్స్ కూడా పంపిణీ చేశారని గుర్తు చేశారు . జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాల యందు 2025 -26 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో విద్యార్థిని విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచి, ఐఐటి బాసరలో సీట్లు సాధించారని ,
పాఠశాల నిర్వహణ యందు చక్కటి ప్రతిభను కనబరుస్తున్న ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందాని అభినందించారు . ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ ఎం వెంకటేశ్వర్లు, సీఎంఓ వి సురేష్, జెండర్ క్వాలిటీ కోఆర్డినేటర్ వై గాయత్రి, మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు .


