క్విజ్ పోటీలలో మిట్ట కోడూరు విద్యార్థుల ప్రతిభ
On
విశ్వంభర, పరిగి: శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జెడ్ పి హెచ్ ఎస్ గడిసింగాపూర్ కాంప్లెక్స్ స్థాయిలో నిర్వహించిన క్విజ్ పోటీలలో మిట్ట కోడూరు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు మొదటి బహుమతి లభించింది.స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎన్. జాంప్లా , శిక్షణ ఫౌండేషన్ ప్రతినిధుల చేతుల మీదగా విద్యార్థులు బహుమతులు అందుకున్నారు. రెండో బహుమతిగా యు పి ఎస్ ,రంగంపల్లి విద్యార్థులు, మూడవ బహుమతి ప్రాథమిక పాఠశాల గడిసింగాపూర్ విద్యార్థుల కు లభించాయి. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గోపాల్, పి ఆర్ టి యు పరిగి మండల శాఖ అధ్యక్షులు బుగ్గయ్య . గౌరవ అధ్యక్షులు ఎండి ఉస్మాన్ అలీ, ప్రధాన కార్యదర్శి రాకేష్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.



