కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
విశ్వంబర, మహబూబాబాద్ జిల్లా : జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్ చేతుల మీదుగా కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ జరిగింది . ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులను 91 మంది లబ్ధిదారులకు రూ.91 లక్షల పదివేల 556 రూపాయల విలువచేసే కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు . ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఈ పథకం ఎంతో ఆసరాగా నిలుస్తోందని, ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ తాసిల్దార్ చంద్ర రాజేశ్వరరావు , సంబంధిత అధికారులు , మహబూబాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ జ్యోతి రమేష్ నాయక్, వార్డ్ కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలు , పట్టణ నాయకులు,ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు



