ఇంటర్ పరీక్షలు ప్రారంభం
On
విశ్వంభర, మహబూబాబాద్ : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా జరిగాయని ఇంటర్మీడియట్ విద్యాధికారి సిహెచ్ మదార్ గౌడ్ తెలిపారు. జిల్లా మొత్తం మీద మొదటి సంవత్సరం విద్యార్థులు 18 పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతంగా పరీక్ష రాశారు. ఈరోజు మరిపెడ ప్రభుత్వ జూనియర్ కళాశాలను అడిషనల్ కలెక్టర్ లెనిన్ వాత వత్సల్ టోప్పో సందర్శించారు. పరీక్ష తీరును సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్స్,
జిల్లా పరీక్షా అధికారులు తనిఖీ చేశారు.



