పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి : శ్రీలత
On
విశ్వంభర, మహేశ్వరం : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా డిఆర్ డిఓ శ్రీలత మహిళా సంఘాల సభ్యులతో కలసి మహేశ్వరం మండలంలో మండల పరిషత్ కార్యాలయం స్త్రీశక్తి భవనం ఆవరణ లోని పరిసరాలను, కార్యాలయం లో చెత్తను తొలగించి పరిశుభ్రం చేశారు. ప్రతి ఇల్లు, ఆపీసు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు, ఈ కార్యక్రమంలో ఏపీఎం , సత్యనారాయణ, అపో పరిమళ, పంచాయతీ కార్యదర్శి సుజాత, సీసీ లు, టీ ఏ లు, వి ఓ ఏ లు, గ్రామ పంచాయతీ వర్కర్లు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.



