వర్షాలు కురవాలని శివాలయంలో ప్రత్యేక పూజలు
విశ్వంభర, జనగాం : దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులకు మేలు జరగాలని ఆకాంక్షిస్తూ గ్రామంలోని పురాతన చరిత్ర కలిగిన శివాలయంలో శివలింగానికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పల్లెర్ల సంధ్యారాణి నవీన్, ఉప సర్పంచ్ ఎడమ సంతోష్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని గ్రామానికి సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే గ్రామాభివృద్ధికి పునాది అని అన్నారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతుల కష్టాలు తీరాలని, గ్రామంలో సుభిక్షం నెలకొనాలని పరమేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు.
వర్షాలు కురవాలని శివాలయంలో ప్రత్యేక పూజలు
విశ్వంభర, జనగాం : దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులకు మేలు జరగాలని ఆకాంక్షిస్తూ గ్రామంలోని పురాతన చరిత్ర కలిగిన శివాలయంలో శివలింగానికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పల్లెర్ల సంధ్యారాణి నవీన్, ఉప సర్పంచ్ ఎడమ సంతోష్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొని గ్రామానికి సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతుల సంక్షేమమే గ్రామాభివృద్ధికి పునాది అని అన్నారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతుల కష్టాలు తీరాలని, గ్రామంలో సుభిక్షం నెలకొనాలని పరమేశ్వరుడిని ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని పేర్కొన్నారు.


