భక్తులకు ఇబ్బందులు లేకుండా బోనాల జాతర నిర్వహించాలి: పద్మారావు గౌడ్
విశ్వంభర, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా నిర్వహించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సూచించారు. మంగళవారం ఉజ్జయిని మహంకాళి దేవాలయ కార్యనిర్వహణాధికారి మనోహర్ రెడ్డి, ప్రధానార్చకుల బృందం టకార బస్తీలోని పద్మారావు గౌడ్ నివాసాన్ని సందర్శించి బోనాల జాతరలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందజేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పద్మారావు దంపతులను సంప్రదాయబద్ధంగా సత్కరించారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా బోనాల జాతర నిర్వహించాలి: పద్మారావు గౌడ్
విశ్వంభర, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరను ఘనంగా నిర్వహించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సూచించారు. మంగళవారం ఉజ్జయిని మహంకాళి దేవాలయ కార్యనిర్వహణాధికారి మనోహర్ రెడ్డి, ప్రధానార్చకుల బృందం టకార బస్తీలోని పద్మారావు గౌడ్ నివాసాన్ని సందర్శించి బోనాల జాతరలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందజేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పద్మారావు దంపతులను సంప్రదాయబద్ధంగా సత్కరించారు.


