హుస్నాబాద్ మున్సిపల్ ప్రజాప్రతినిధులకు కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ
విశ్వంభర, హైదరాబాద్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా లో మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యుల కోసం మంగళవారం కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్–2026, జల్ సంచయ్–జన్ భాగిదారి, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం పనితీరు, తెలంగాణ మున్సిపల్ చట్టం–2019, అమృత్ సబ్ స్కీమ్స్, క్యాచ్ ది రెయిన్ వంటి కీలక అంశాలపై నిపుణులు సమగ్ర అవగాహన కల్పించారు. పట్టణాల అభివృద్ధి, పారిశుధ్యం, వర్షపు నీటి సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజాప్రతినిధుల పాత్రపై ప్రత్యేకంగా వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు బూరుగు లత, పిల్లి తిరుపతి, సావుల మంజుల, పూదరి వరప్రసాద్, కేశవేని రమేష్, బొల్లి శ్రీనివాస్, వైద్యం కిరణ్ ప్రసాద్, గాదెపాక రవీందర్, వాల సుప్రజ, బత్తుల స్వరూప,గోపగోని శోభన్ బాబుతో పాటు కో-ఆప్షన్ సభ్యులు ఎం.డి. హసన్, భూక్య సరోజన పాల్గొన్నారు. శిక్షణ ద్వారా పట్టణ పాలనలో సమర్థవంతమైన సేవలు అందించేందుకు అవసరమైన అంశాలపై విలువైన సమాచారం పొందినట్లు వారు తెలిపారు.
హుస్నాబాద్ మున్సిపల్ ప్రజాప్రతినిధులకు కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ
విశ్వంభర, హైదరాబాద్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా లో మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యుల కోసం మంగళవారం కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్–2026, జల్ సంచయ్–జన్ భాగిదారి, మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం పనితీరు, తెలంగాణ మున్సిపల్ చట్టం–2019, అమృత్ సబ్ స్కీమ్స్, క్యాచ్ ది రెయిన్ వంటి కీలక అంశాలపై నిపుణులు సమగ్ర అవగాహన కల్పించారు. పట్టణాల అభివృద్ధి, పారిశుధ్యం, వర్షపు నీటి సంరక్షణ, మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజాప్రతినిధుల పాత్రపై ప్రత్యేకంగా వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు బూరుగు లత, పిల్లి తిరుపతి, సావుల మంజుల, పూదరి వరప్రసాద్, కేశవేని రమేష్, బొల్లి శ్రీనివాస్, వైద్యం కిరణ్ ప్రసాద్, గాదెపాక రవీందర్, వాల సుప్రజ, బత్తుల స్వరూప,గోపగోని శోభన్ బాబుతో పాటు కో-ఆప్షన్ సభ్యులు ఎం.డి. హసన్, భూక్య సరోజన పాల్గొన్నారు. శిక్షణ ద్వారా పట్టణ పాలనలో సమర్థవంతమైన సేవలు అందించేందుకు అవసరమైన అంశాలపై విలువైన సమాచారం పొందినట్లు వారు తెలిపారు.


