కరాటే జాతీయ పోటీలకు జివిఆర్ అకాడమీ విద్యార్థులు
విశ్వంభర, నారాయణగూడ: బెంగళూరులో ఆగస్టు 2న జరిగే 14వ షోటోఖాన్ జాతీయ కరాటే పోటీలకు తెలంగాణ నుంచి హైదరాబాదు నారాయణగూడలోని జివిఆర్ కరాటే అకాడమీకి చెందిన 24 మంది విద్యార్థులు ఎంపికైనట్లు అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జి.ఎస్. గోపాల్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా హిమాయత్నగర్ మాజీ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్న గౌడ్ ఎంపికైన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ముఖ్యంగా బాలికలు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవడం నేటి పరిస్థితుల్లో అవసరమని ఆమె అన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు పతకాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో: డాక్టర్ కిషోర్ కృష్ణారెడ్డి, అమృత రెడ్డి, ఘన సంతోషనీ రెడ్డి, సుధాకర్, అనగ, అవిజ్ఞ వెంక రెడ్డి, ద్వైత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
కరాటే జాతీయ పోటీలకు జివిఆర్ అకాడమీ విద్యార్థులు
విశ్వంభర, నారాయణగూడ: బెంగళూరులో ఆగస్టు 2న జరిగే 14వ షోటోఖాన్ జాతీయ కరాటే పోటీలకు తెలంగాణ నుంచి హైదరాబాదు నారాయణగూడలోని జివిఆర్ కరాటే అకాడమీకి చెందిన 24 మంది విద్యార్థులు ఎంపికైనట్లు అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జి.ఎస్. గోపాల్ రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా హిమాయత్నగర్ మాజీ కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్న గౌడ్ ఎంపికైన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ముఖ్యంగా బాలికలు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవడం నేటి పరిస్థితుల్లో అవసరమని ఆమె అన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణకు పతకాలు సాధించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో: డాక్టర్ కిషోర్ కృష్ణారెడ్డి, అమృత రెడ్డి, ఘన సంతోషనీ రెడ్డి, సుధాకర్, అనగ, అవిజ్ఞ వెంక రెడ్డి, ద్వైత, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.


