ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి
విశ్వాంభర, పెద్ద శంకరంపేట: తెలంగాణ ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని సంగారెడ్డి జిల్లా బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కోణం విట్టల్. బీజేవైఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ యాదవ్ లు పేర్కొన్నారు. మంగళవారం పెద్ద శంకరంపేట లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బిజే వైఎం తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఫీజుల బకాయి బిజెపి లడాయి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందన్నారు. విద్యార్థులకు బకాయి ఉన్న 15వేల కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు అత్యవసర ఆర్థిక ఉపశమనం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ బి జె వై ఎం కన్వీనర్ సాయి పటేల్ కో కన్వీనర్ బుగుడాల కృష్ణ.. మండల బిజెపి అధ్యక్షుడు శ్రావణ్ కుమార్. నాయకులు ప్రభు గౌడ్ ప్రవీణ్ సాయిరాం ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి
విశ్వాంభర, పెద్ద శంకరంపేట: తెలంగాణ ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని సంగారెడ్డి జిల్లా బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కోణం విట్టల్. బీజేవైఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ యాదవ్ లు పేర్కొన్నారు. మంగళవారం పెద్ద శంకరంపేట లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బిజే వైఎం తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఫీజుల బకాయి బిజెపి లడాయి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందన్నారు. విద్యార్థులకు బకాయి ఉన్న 15వేల కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు అత్యవసర ఆర్థిక ఉపశమనం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ బి జె వై ఎం కన్వీనర్ సాయి పటేల్ కో కన్వీనర్ బుగుడాల కృష్ణ.. మండల బిజెపి అధ్యక్షుడు శ్రావణ్ కుమార్. నాయకులు ప్రభు గౌడ్ ప్రవీణ్ సాయిరాం ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


