జలసిరి పనులపై రైతులకు అవగాహన
విశ్వంభర, పెద్ద శంకరంపేట: పెద్దశంకరంపేట–ఎ మండలంలోని శివాయిపల్లి గ్రామపంచాయతీలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం విత్తన మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు నాణ్యమైన విత్తనాల వినియోగం, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆరుతడి పంటల ప్రాధాన్యంపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జలసిరి కార్యక్రమం గురించి రైతులకు ఎంపీడీవో క్రాంతి కుమార్r అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఫామ్ పాండ్లు , బోర్వెల్ రీఛార్జ్ నిర్మాణాలు ఏర్పాటు చేయడం ద్వారా భూగర్భ జలాల మట్టం పెరిగి, వ్యవసాయానికి దీర్ఘకాలికంగా నీటి లభ్యత మెరుగుపడుతుందని వివరించారు. భూమి ఉన్న ప్రతి రైతు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని జలసిరి పనులను చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి అఖిల్ హుస్సేన్, ఏపీఓ సంతోష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి సవిత, టెక్నికల్ అసిస్టెంట్ రమేష్, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
జలసిరి పనులపై రైతులకు అవగాహన
విశ్వంభర, పెద్ద శంకరంపేట: పెద్దశంకరంపేట–ఎ మండలంలోని శివాయిపల్లి గ్రామపంచాయతీలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం విత్తన మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు నాణ్యమైన విత్తనాల వినియోగం, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఆరుతడి పంటల ప్రాధాన్యంపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జలసిరి కార్యక్రమం గురించి రైతులకు ఎంపీడీవో క్రాంతి కుమార్r అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఫామ్ పాండ్లు , బోర్వెల్ రీఛార్జ్ నిర్మాణాలు ఏర్పాటు చేయడం ద్వారా భూగర్భ జలాల మట్టం పెరిగి, వ్యవసాయానికి దీర్ఘకాలికంగా నీటి లభ్యత మెరుగుపడుతుందని వివరించారు. భూమి ఉన్న ప్రతి రైతు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని జలసిరి పనులను చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి అఖిల్ హుస్సేన్, ఏపీఓ సంతోష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి సవిత, టెక్నికల్ అసిస్టెంట్ రమేష్, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


