హైడ్రా తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలి: సీపీఐ

విశ్వంభర, హైదరాబాదు : హైడ్రాపై హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.ఎస్. బోస్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు. హైడ్రా విధి నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నా చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడి ప్రజా ఆస్తిని రక్షించిందన్నారు. కాలనీల్లో పార్కు స్థలాలు, ప్రభుత్వ భూములను భూ కబ్జాదారుల నుంచి రక్షించడంలో హైడ్రా కీలక పాత్ర పోషించిందని తెలిపారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో హైడ్రా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. భూ ఆక్రమణదారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, హైడ్రాపై వచ్చిన ఆరోపణలకు చట్టపరమైన స్పష్టత కోసం వెంటనే సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

🕒 29 Jul 2026 ✍️ Desk

హైడ్రా తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలి: సీపీఐ

విశ్వంభర, హైదరాబాదు : హైడ్రాపై హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.ఎస్. బోస్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు. హైడ్రా విధి నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నా చెరువులు, ప్రభుత్వ భూములను కాపాడి ప్రజా ఆస్తిని రక్షించిందన్నారు. కాలనీల్లో పార్కు స్థలాలు, ప్రభుత్వ భూములను భూ కబ్జాదారుల నుంచి రక్షించడంలో హైడ్రా కీలక పాత్ర పోషించిందని తెలిపారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో హైడ్రా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. భూ ఆక్రమణదారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, హైడ్రాపై వచ్చిన ఆరోపణలకు చట్టపరమైన స్పష్టత కోసం వెంటనే సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

🔗 https://www.vishvambhara.com/telangana/cpi-to-approach-supreme-court-on-hydra-verdict/article-20143

Tags:  

Advertisement

LatestNews

కదిరి కేజీబీవీలో టీచర్ నిర్వాకం.. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న ఘటన వైరల్
టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్.. భక్తులను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు
ఆగస్టు 31 వరకు ఉచిత కంటి పరీక్షలు.. అనంత‌పురంలో డా. అగర్వాల్స్ ఐ హాస్పిటల్ ప్రత్యేక ఆఫర్
సినిమా సీన్‌ను తలపించిన తమిళనాడు ఘటన.. రూ.15 వేల ఆశతో గుండు గీయించుకున్న మహిళలు
పెద్దవంగర మండలంలో  అభివృద్ధి పనులకు శ్రీకారం
అంగన్వాడీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల
మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి గుట్ట దేవస్థానం చైర్మన్‌గా తుమ్మల శ్రీనివాస్ యాదవ్