పీఆర్సీని వెంటనే ప్రకటించాలి
విశ్వంభర, రామన్నపేట: 51శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగులో ఉన్న 6 డిఏలను విడుదల చేయాలని, సి.పి.ఎస్ విధానాన్ని రద్దు చేయాలని, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టిపి.యు.ఎస్) రాష్ట్ర ఆడిట్ కమిటీ కో-కన్వీనర్ పెద్దిరెడ్డి శంకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల పరిధిలోని సర్నేనిగూడెం, వెల్లంకి, సిరిపురం, రామన్నపేట, ఇంద్రపాలనగరం, భోగారం, లక్ష్మాపురం గ్రామాలలోని వివిధ పాఠశాలలలో తపస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ఉపాధ్యక్షుడు సప్పిడి సీనారెడ్డి, తపస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, నవీన్, వనం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
పీఆర్సీని వెంటనే ప్రకటించాలి
విశ్వంభర, రామన్నపేట: 51శాతం ఫిట్మెంట్ తో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగులో ఉన్న 6 డిఏలను విడుదల చేయాలని, సి.పి.ఎస్ విధానాన్ని రద్దు చేయాలని, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టిపి.యు.ఎస్) రాష్ట్ర ఆడిట్ కమిటీ కో-కన్వీనర్ పెద్దిరెడ్డి శంకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల పరిధిలోని సర్నేనిగూడెం, వెల్లంకి, సిరిపురం, రామన్నపేట, ఇంద్రపాలనగరం, భోగారం, లక్ష్మాపురం గ్రామాలలోని వివిధ పాఠశాలలలో తపస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా ఉపాధ్యక్షుడు సప్పిడి సీనారెడ్డి, తపస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, నవీన్, వనం అంజయ్య తదితరులు పాల్గొన్నారు.


