తెలంగాణ ఉద్యమకారుల భూపోరాటంలో పాల్గొన్న సంగారెడ్డి నాయకులు

తెలంగాణ ఉద్యమకారుల భూపోరాటంలో పాల్గొన్న సంగారెడ్డి నాయకులు

విశ్వాంభర, సంగారెడ్డి: తెలంగాణ ఉద్యమకారుల భూపోరాట కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కలబ్గూర్ దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. పోలీసుల కళ్లుగప్పి నిర్వహించిన ఈ భూపోరాటంలో పాల్గొన్న నాయకులు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి చాటారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, వారి హక్కులను పరిరక్షించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సంక్షేమం, గౌరవ పరిరక్షణ కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వేణు మాధవ్, గోపాల్ రెడ్డి, చంద్రిక కరుణాకర్, కృష్ణ, నితిన్ ఆనంద్ యాదవ్, మనోజ్ రెడ్డి, నరసింహ రెడ్డి, కృష్ణ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

🕒 03 Jul 2026 ✍️ Desk

తెలంగాణ ఉద్యమకారుల భూపోరాటంలో పాల్గొన్న సంగారెడ్డి నాయకులు

విశ్వాంభర, సంగారెడ్డి: తెలంగాణ ఉద్యమకారుల భూపోరాట కార్యక్రమంలో సంగారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కలబ్గూర్ దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. పోలీసుల కళ్లుగప్పి నిర్వహించిన ఈ భూపోరాటంలో పాల్గొన్న నాయకులు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి చాటారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, వారి హక్కులను పరిరక్షించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల సంక్షేమం, గౌరవ పరిరక్షణ కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వేణు మాధవ్, గోపాల్ రెడ్డి, చంద్రిక కరుణాకర్, కృష్ణ, నితిన్ ఆనంద్ యాదవ్, మనోజ్ రెడ్డి, నరసింహ రెడ్డి, కృష్ణ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.

🔗 https://www.vishvambhara.com/telangana/sangareddy-leaders-who-participated-in-the-land-struggle-of-telangana/article-17750

Tags: