ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి: బీసీ జేఏసీ
విశ్వంభర, బర్కత్పుర: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ జేఏసీ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కళాశాలల బంద్ విజయవంతమైందని తెలిపారు. గురువారం బర్కత్పురలో విద్యార్థులతో కలిసి ర్యాలీ, ధర్నా నిర్వహించారు.ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 15న 'చలో హైదరాబాద్' కార్యక్రమం చేపడతామని, అనంతరం 'కాక్రోచ్ ఉద్యమం' నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ జేఏసీ ఉద్యమానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి: బీసీ జేఏసీ
విశ్వంభర, బర్కత్పుర: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి, పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ జేఏసీ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కళాశాలల బంద్ విజయవంతమైందని తెలిపారు. గురువారం బర్కత్పురలో విద్యార్థులతో కలిసి ర్యాలీ, ధర్నా నిర్వహించారు.ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 15న 'చలో హైదరాబాద్' కార్యక్రమం చేపడతామని, అనంతరం 'కాక్రోచ్ ఉద్యమం' నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించి పేద విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బీసీ జేఏసీ ఉద్యమానికి తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.


