బీఆర్ఎస్‌లోకి రాజగోపాల్ రెడ్డి జంప్..!? - మంత్రి పదవి రాక అసంతృప్తి

బీఆర్ఎస్‌లోకి రాజగోపాల్ రెడ్డి జంప్..!? - మంత్రి పదవి రాక అసంతృప్తి

  •   సీఎం కార్యక్రమానికి  గైర్హాజరు.
  • మంత్రి పదవి రాక అసంతృప్తి
  •   YTDA బోర్డు నియామకాలపైనా అసహనం
  •   పార్టీ మార్పుపై రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు.
  •   బీఆర్ఎస్‌లో చేరతారనే టాక్..!
 

విశ్వంభర, డెస్క్ /హైదరాబాద్ :-తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నల్లగొండ జిల్లాలో జరిగిన హ్యమ్ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై ప్రారంభించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు దాదాపు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ అదే జిల్లాకు చెందిన కీలక నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం కనిపించలేదు.ఇది సాధారణ గైర్హాజరా? లేక రాజకీయ సంకేతమా? అనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. రెండు విడతలుగా జరిగిన కేబినెట్ విస్తరణలోనూ ఆయనకు అవకాశం రాకపోవడంతో అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తమైంది.
 
మంత్రి పదవి రాకపోవడమే కాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై కూడా రాజగోపాల్ రెడ్డి పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. సీఎం పదవిని హైకమాండే నిర్ణయిస్తుందని, వ్యక్తిగత ప్రకటనలు చేయడం సరికాదంటూ పరోక్షంగా రేవంత్‌ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు. దీంతో ఇద్దరి మధ్య రాజకీయ దూరం మరింత పెరిగిందనే అభిప్రాయం ఏర్పడింది.నల్లగొండలో సీఎం పాల్గొన్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి రాజగోపాల్ రెడ్డి హాజరుకాకపోవడం ఆ విభేదాలకు మరో నిదర్శనమా? అన్న చర్చ మొదలైంది. జిల్లాలోని మిగతా ప్రజాప్రతినిధులందరూ హాజరైన వేళ ఆయన గైర్హాజరు కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే అసలు ప్రశ్న ఇప్పుడు ఒక్కటే... మంత్రి పదవి దక్కకపోతే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? లేక మరోసారి రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకుంటారా? గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్లి, మళ్లీ కాంగ్రెస్‌లో చేరిన ఆయన రాజకీయ ప్రయాణం చూస్తే ఎలాంటి అవకాశాన్నీ పూర్తిగా కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
 
మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. పార్టీని బలోపేతం చేయాలంటే సీనియర్ నేతలందరినీ కలుపుకుపోవాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. అలాంటి సమయంలో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పిగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 

ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YTDA) బోర్డు నియామకాల విషయంలోనూ తనను సంప్రదించలేదని, తన అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వలేదని రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గానికి సంబంధించిన కీలక నిర్ణయంలో తనను పక్కన పెట్టడాన్ని ఆయన తీవ్రంగా మనస్తాపానికి గురిచేసిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

ఒకవైపు మంత్రి పదవి దక్కకపోవడం... మరోవైపు యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ బోర్డు నియామకాల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తి... తాజాగా సీఎం కార్యక్రమానికి గైర్హాజరు కావడం—ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో అసౌకర్యంగా ఉన్నారనే ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే ఆయన భవిష్యత్ రాజకీయ నిర్ణయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఆయన తదుపరి అడుగు ఏంటనే అంశం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

Read More కీర్తన గోల్డ్ ఫైనల్స్ లో భారీ గోల్డ్ స్కాం

 అసంతృప్తితో మంత్రి కొండా సురేఖ..!

YTDA బోర్డు వ్యవహారం ఇప్పుడు మరో కోణం తిరిగింది. దేవాదాయ శాఖ మంత్రి మంత్రి కొండా సురేఖకు సైతం ఈ విషయం గురించి తెలియదని సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అందుకే మంత్రి సురేఖ క్యాబినెట్ బేటీకి గైర్హజరయ్యారని టాక్ నడుస్తుంది. తనను ఏ మాత్రం సంప్రదించకుండా సీఎం రేవంత్ రెడ్డి తన శాఖలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల తనకు అవమానం జరిగిందని బావించిన మంత్రి క్యాబినెట్ భేటీ రాకుండా సైడ్ అయ్యి తన అసంతృప్తి జ్వాలను వినిపించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ మొత్తం వ్యవహారం పై మంత్రి సురేఖ హైకమాండ్ కూడా కంప్లైంట్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ ఏ మంత్రిని కూడా సంప్రదించకుండా ఇలాంటి ఓ పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆమె వాపోయినట్టు తెలుస్తుంది. కాగా, సీఎం రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయం కాస్త సచివాలయ వర్గాలతో పాటు అందర్నీ షాక్కు గురిచేసినట్టు చెబుతున్నారు. మరి హైకమాండ్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి అంశమని రాజకీయ విశ్లేషకలు అభిప్రాయపడుతున్నారు.

 

🕒 04 Jul 2026 ✍️ Desk

బీఆర్ఎస్‌లోకి రాజగోపాల్ రెడ్డి జంప్..!? - మంత్రి పదవి రాక అసంతృప్తి

విశ్వంభర, డెస్క్ /హైదరాబాద్ :-తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నల్లగొండ జిల్లాలో జరిగిన హ్యమ్ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై ప్రారంభించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు దాదాపు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ అదే జిల్లాకు చెందిన కీలక నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం కనిపించలేదు.ఇది సాధారణ గైర్హాజరా? లేక రాజకీయ సంకేతమా? అనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రి పదవిపై రాజగోపాల్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. రెండు విడతలుగా జరిగిన కేబినెట్ విస్తరణలోనూ ఆయనకు అవకాశం రాకపోవడంతో అసంతృప్తి బహిరంగంగానే వ్యక్తమైంది.
 
మంత్రి పదవి రాకపోవడమే కాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై కూడా రాజగోపాల్ రెడ్డి పలు సందర్భాల్లో విమర్శలు చేశారు. సీఎం పదవిని హైకమాండే నిర్ణయిస్తుందని, వ్యక్తిగత ప్రకటనలు చేయడం సరికాదంటూ పరోక్షంగా రేవంత్‌ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు. దీంతో ఇద్దరి మధ్య రాజకీయ దూరం మరింత పెరిగిందనే అభిప్రాయం ఏర్పడింది.నల్లగొండలో సీఎం పాల్గొన్న ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి రాజగోపాల్ రెడ్డి హాజరుకాకపోవడం ఆ విభేదాలకు మరో నిదర్శనమా? అన్న చర్చ మొదలైంది. జిల్లాలోని మిగతా ప్రజాప్రతినిధులందరూ హాజరైన వేళ ఆయన గైర్హాజరు కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.అయితే అసలు ప్రశ్న ఇప్పుడు ఒక్కటే... మంత్రి పదవి దక్కకపోతే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? లేక మరోసారి రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకుంటారా? గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్లి, మళ్లీ కాంగ్రెస్‌లో చేరిన ఆయన రాజకీయ ప్రయాణం చూస్తే ఎలాంటి అవకాశాన్నీ పూర్తిగా కొట్టిపారేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
 
మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం అసంతృప్త నేతలను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తోంది. పార్టీని బలోపేతం చేయాలంటే సీనియర్ నేతలందరినీ కలుపుకుపోవాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. అలాంటి సమయంలో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పిగా మారే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 

ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ (YTDA) బోర్డు నియామకాల విషయంలోనూ తనను సంప్రదించలేదని, తన అభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వలేదని రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గానికి సంబంధించిన కీలక నిర్ణయంలో తనను పక్కన పెట్టడాన్ని ఆయన తీవ్రంగా మనస్తాపానికి గురిచేసిందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

ఒకవైపు మంత్రి పదవి దక్కకపోవడం... మరోవైపు యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ బోర్డు నియామకాల్లో తనకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న అసంతృప్తి... తాజాగా సీఎం కార్యక్రమానికి గైర్హాజరు కావడం—ఈ పరిణామాలన్నీ కలిపి చూస్తే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో అసౌకర్యంగా ఉన్నారనే ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే ఆయన భవిష్యత్ రాజకీయ నిర్ణయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఆయన తదుపరి అడుగు ఏంటనే అంశం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

 అసంతృప్తితో మంత్రి కొండా సురేఖ..!

YTDA బోర్డు వ్యవహారం ఇప్పుడు మరో కోణం తిరిగింది. దేవాదాయ శాఖ మంత్రి మంత్రి కొండా సురేఖకు సైతం ఈ విషయం గురించి తెలియదని సచివాలయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అందుకే మంత్రి సురేఖ క్యాబినెట్ బేటీకి గైర్హజరయ్యారని టాక్ నడుస్తుంది. తనను ఏ మాత్రం సంప్రదించకుండా సీఎం రేవంత్ రెడ్డి తన శాఖలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల తనకు అవమానం జరిగిందని బావించిన మంత్రి క్యాబినెట్ భేటీ రాకుండా సైడ్ అయ్యి తన అసంతృప్తి జ్వాలను వినిపించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ మొత్తం వ్యవహారం పై మంత్రి సురేఖ హైకమాండ్ కూడా కంప్లైంట్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ ఏ మంత్రిని కూడా సంప్రదించకుండా ఇలాంటి ఓ పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆమె వాపోయినట్టు తెలుస్తుంది. కాగా, సీఎం రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయం కాస్త సచివాలయ వర్గాలతో పాటు అందర్నీ షాక్కు గురిచేసినట్టు చెబుతున్నారు. మరి హైకమాండ్ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి అంశమని రాజకీయ విశ్లేషకలు అభిప్రాయపడుతున్నారు.

 

🔗 https://www.vishvambhara.com/telangana/rajagopal-reddy-jump-into-brs/article-17819

Tags: