గాయపడిన మాజీ సర్పంచ్ అరిపొద్దీన్ను పరామర్శించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్
విశ్వంభర, సదాశివపేట: సదాశివపేట మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ అరిపొద్దీన్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మిలిగిరిపేట గ్రామ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తండ్రి అంజిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు మిలిగిరిపేట గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంజిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు, కౌన్సిలర్ కొత్తగొల్ల సోమశేఖర్, సర్పంచులు సంతోష్ గౌడ్, మునిగే నవీన్, మాజీ ఎంపీటీసీలు శివకుమార్, హనుమంతు, అహ్మద్, మాజీ సర్పంచులు లక్ష్మారెడ్డి, హనుమంత్ రెడ్డి, బాలరాజ్, శేఖర్, మాజీ ఉపసర్పంచ్ పద్మశాలి రమేష్, సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్వీ ఇన్చార్జ్ పెద్దగొల్ల శ్రీహరి, నాయకులు పాండు నాయక్, నిజాముద్దీన్, బసవరాజ్, సద్దాం, శేఖర్, శ్రీకాంత్, సర్వేశ్వర్ యాదవ్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గాయపడిన మాజీ సర్పంచ్ అరిపొద్దీన్ను పరామర్శించిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్
విశ్వంభర, సదాశివపేట: సదాశివపేట మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ సర్పంచ్ అరిపొద్దీన్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మిలిగిరిపేట గ్రామ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తండ్రి అంజిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన నేపథ్యంలో, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారు మిలిగిరిపేట గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంజిరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దగొల్ల ఆంజనేయులు, కౌన్సిలర్ కొత్తగొల్ల సోమశేఖర్, సర్పంచులు సంతోష్ గౌడ్, మునిగే నవీన్, మాజీ ఎంపీటీసీలు శివకుమార్, హనుమంతు, అహ్మద్, మాజీ సర్పంచులు లక్ష్మారెడ్డి, హనుమంత్ రెడ్డి, బాలరాజ్, శేఖర్, మాజీ ఉపసర్పంచ్ పద్మశాలి రమేష్, సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్వీ ఇన్చార్జ్ పెద్దగొల్ల శ్రీహరి, నాయకులు పాండు నాయక్, నిజాముద్దీన్, బసవరాజ్, సద్దాం, శేఖర్, శ్రీకాంత్, సర్వేశ్వర్ యాదవ్, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


