మేడ్చల్ జిల్లా బిజెపి జనరల్ సెక్రెటరీ గోనె శ్రీనివాస్
అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిని చట్టాలు కఠినంగా శిక్షించాలి
విశ్వంభర, బోడుప్పల్: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 389వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా బిజెపి జనరల్ సెక్రెటరీ గోనె శ్రీనివాస్, అడ్వకేట్ కిరణ్ పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించి, భారత రాజ్యాంగ నిర్మాణం కోసం ఆయన చేసిన సేవలను, త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా గోనె శ్రీనివాస్ మాట్లాడుతూ తన జీవితాన్ని త్యాగం చేసి భారతదేశానికి అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా భారతీయులందరికీ సమానమైన హక్కులు కల్పించబడ్డాయని, నేడు రాజ్యాంగంలోని చట్టాలు కొందరికి చుట్టాలయ్యా యని, బడుగు, బలహీన వర్గాలకు సరైన న్యాయం జరగడం లేదని, తన, మన తేడా లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి, అక్రమాలకు పాల్పడిన రాజకీయ నేతలను కఠినంగా శిక్షించాలని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలని గోనె శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో గరుగుల యాకయ్య, రాపోలు వెంకటేష్, సాయి బండారి,చిల్ల అంజయ్య, రామకృష్ణ, గల్ల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
మేడ్చల్ జిల్లా బిజెపి జనరల్ సెక్రెటరీ గోనె శ్రీనివాస్
అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిని చట్టాలు కఠినంగా శిక్షించాలి
విశ్వంభర, బోడుప్పల్: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి 389వ ఆదివారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా బిజెపి జనరల్ సెక్రెటరీ గోనె శ్రీనివాస్, అడ్వకేట్ కిరణ్ పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులర్పించి, భారత రాజ్యాంగ నిర్మాణం కోసం ఆయన చేసిన సేవలను, త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా గోనె శ్రీనివాస్ మాట్లాడుతూ తన జీవితాన్ని త్యాగం చేసి భారతదేశానికి అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, ఆయన ఆశయాలకు అనుగుణంగా భారతీయులందరికీ సమానమైన హక్కులు కల్పించబడ్డాయని, నేడు రాజ్యాంగంలోని చట్టాలు కొందరికి చుట్టాలయ్యా యని, బడుగు, బలహీన వర్గాలకు సరైన న్యాయం జరగడం లేదని, తన, మన తేడా లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతి, అక్రమాలకు పాల్పడిన రాజకీయ నేతలను కఠినంగా శిక్షించాలని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలని గోనె శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో గరుగుల యాకయ్య, రాపోలు వెంకటేష్, సాయి బండారి,చిల్ల అంజయ్య, రామకృష్ణ, గల్ల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.


