పట్టపగలే ఇంట్లో చోరీ
విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యన్నంపేటలో పొలగోని మధు (66), అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఉన్న గల్లీలో సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం మధు ఇంటి తలుపులు గేటుకు తాళం వేసి పక్కింటికి వెళ్లి వచ్చేసరికి తాళాలు తలుపులు పగలగొట్టి ఉండడంతో. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా, బీరువా తాళం కూడా తెరిచి ఉంది . బీరువాలోని దాదాపు 8 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు దొంగలు అపహరించినట్లు గుర్తించి వెంటనే పోచారం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పట్టపగలే ఇంట్లో చోరీ
విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యన్నంపేటలో పొలగోని మధు (66), అంబేద్కర్ విగ్రహం సమీపంలో ఉన్న గల్లీలో సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం మధు ఇంటి తలుపులు గేటుకు తాళం వేసి పక్కింటికి వెళ్లి వచ్చేసరికి తాళాలు తలుపులు పగలగొట్టి ఉండడంతో. వెంటనే ఇంట్లోకి వెళ్లి చూడగా, బీరువా తాళం కూడా తెరిచి ఉంది . బీరువాలోని దాదాపు 8 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు దొంగలు అపహరించినట్లు గుర్తించి వెంటనే పోచారం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.


