మంత్రి దామోదర్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

మంత్రి దామోదర్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

విశ్వంభర, సంగారెడ్డి : ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని బోడిషెట్‌పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచ్ పి. మల్లేశ్వరి సంగన్న, వార్డు సభ్యులు అనంత శ్యామమ్మ, అనంతలక్ష్మి, శ్రీకాంత్‌తో పాటు సుమారు 50 మంది కార్యకర్తలు ఆదివారం మంత్రి దామోదర్ రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, మహిళా సాధికారత, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, జైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

🕒 03 Aug 2026 ✍️ Desk

మంత్రి దామోదర్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు

విశ్వంభర, సంగారెడ్డి : ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని బోడిషెట్‌పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సర్పంచ్ పి. మల్లేశ్వరి సంగన్న, వార్డు సభ్యులు అనంత శ్యామమ్మ, అనంతలక్ష్మి, శ్రీకాంత్‌తో పాటు సుమారు 50 మంది కార్యకర్తలు ఆదివారం మంత్రి దామోదర్ రాజనర్సింహ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి వారికి పార్టీ కండువా కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, మహిళా సాధికారత, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల పెంపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, జైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

🔗 https://www.vishvambhara.com/telangana/joining-the-congress-in-the-presence-of-minister-damodar/article-20899

Tags: