బోరంచ శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
విశ్వంభర, పెద్ద శంకరంపేట్. నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని మానూర్ మండల బోరంచ గ్రామంలో వెలసిన శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారిని నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని, గ్రామాలు సుభిక్షంగా విలసిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.అనంతరం బోరంచ గ్రామానికి చెందిన ఆప్తులు కొంగరి శేఖర్ రెడ్డి ఆత్మీయంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రముఖులు, ప్రజలతో ముచ్చటించి వారి కుశలప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బోరంచ శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
విశ్వంభర, పెద్ద శంకరంపేట్. నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని మానూర్ మండల బోరంచ గ్రామంలో వెలసిన శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారిని నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని, గ్రామాలు సుభిక్షంగా విలసిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.అనంతరం బోరంచ గ్రామానికి చెందిన ఆప్తులు కొంగరి శేఖర్ రెడ్డి ఆత్మీయంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రముఖులు, ప్రజలతో ముచ్చటించి వారి కుశలప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


