జనజాగరణ యాత్రను విజయవంతం చేయండి

జనజాగరణ యాత్రను విజయవంతం చేయండి

: జిల్లా కోశాధికారి బితి నరేందర్

విశ్వంభర, పరిగి: సీపీస్ ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యోగులారా మన హక్కుల సాధన కోసం జరుగుతున్న టీఎస్ సిపిసిఈయు జనజాగరణ యాత్రలో ప్రతి ఒక్కరూ తప్పక పాల్గొని ఐక్యతను చాటుదామని జిల్లా కోశాధికారి బితి నరేందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.  సోమవారం నాడు ఉదయం 9:10– 9:30 వరకు పరిగి పట్టణంలోని కొడంగల్ చౌరస్తా నుండి పాత తహసీల్దార్ కార్యాలయం ఎదుట గల సర్కిల్ వరకు జనజాగరణ యాత్ర ర్యాలీ ఉంటుందన్నారు. తదుపరి సీపీఏస్ రద్దుకై,మన సమస్యల పరిష్కారం మరియు డిమాండ్స్ టీఎస్ సిపిసిఈయు సాధనపై రాష్ట్ర అధ్యక్షుల వారి ప్రసంగం ఉంటుందన్నారు. అనంతరం ఉదయం 10:10గంటలకు పరిగి శాసన సభ్యులు క్యాంపు కార్యాలయానికి చేరి వినతిపత్రం అందజేయడం జరుగుతుందనీ, అనంతరం 10:15 గంటలకు సమావేశం అనంతరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కావున ప్రతి ఉద్యోగి, ప్రతి ఉపాధ్యాయుడు విధిగా పాల్గొని జనజాగరణ యాత్రను విజయవంతం చేయలన్నారు.

🕒 20 Jul 2026 ✍️ Desk

జనజాగరణ యాత్రను విజయవంతం చేయండి

విశ్వంభర, పరిగి: సీపీస్ ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యోగులారా మన హక్కుల సాధన కోసం జరుగుతున్న టీఎస్ సిపిసిఈయు జనజాగరణ యాత్రలో ప్రతి ఒక్కరూ తప్పక పాల్గొని ఐక్యతను చాటుదామని జిల్లా కోశాధికారి బితి నరేందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.  సోమవారం నాడు ఉదయం 9:10– 9:30 వరకు పరిగి పట్టణంలోని కొడంగల్ చౌరస్తా నుండి పాత తహసీల్దార్ కార్యాలయం ఎదుట గల సర్కిల్ వరకు జనజాగరణ యాత్ర ర్యాలీ ఉంటుందన్నారు. తదుపరి సీపీఏస్ రద్దుకై,మన సమస్యల పరిష్కారం మరియు డిమాండ్స్ టీఎస్ సిపిసిఈయు సాధనపై రాష్ట్ర అధ్యక్షుల వారి ప్రసంగం ఉంటుందన్నారు. అనంతరం ఉదయం 10:10గంటలకు పరిగి శాసన సభ్యులు క్యాంపు కార్యాలయానికి చేరి వినతిపత్రం అందజేయడం జరుగుతుందనీ, అనంతరం 10:15 గంటలకు సమావేశం అనంతరం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కావున ప్రతి ఉద్యోగి, ప్రతి ఉపాధ్యాయుడు విధిగా పాల్గొని జనజాగరణ యాత్రను విజయవంతం చేయలన్నారు.

🔗 https://www.vishvambhara.com/telangana/make-the-campaign-a-success/article-19029

Tags: