గౌస్ పాషాను కఠినంగా శిక్షించాలి
- గుగులోత్ కిషన్ నాయక్ డిమాండ్
విశ్వంభర, మహబూబాబాద్ : ఖమ్మం పట్టణానికి చెందిన రజక కులానికి చెందిన ఓ మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిపి బిల్డింగ్ మీద నుండి కింద పడేసిన గౌస్ పాషాను తక్షణమే కఠినంగా శిక్షించాలి అని ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు కిషన్ నాయక్ కోరారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , గౌస్ బాషా పైన తక్షణమే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని , బాలికకు పూర్తిగా నాణ్యమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఆమెను ఆదుకోవాలని అన్నారు. ఖమ్మం జిల్లాలో అందరూ అగ్రకులాలా వారు ఉండడం వలన ఈ నిరుపేద మైనర్ బాలికకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నదని , ఆ బాలికకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయాలు అందించాలని , ఇప్పటికైనా ప్రజాస్వామ్యవాదులు , మేధావులు , తెలంగాణ ఉద్యమకారులు , వివిధ రాజకీయ పార్టీలు కలిసి రజక బిడ్డ మీద అన్యాయం జరిగిన విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితురాలి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని కిషన్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ కోరారు .
గౌస్ పాషాను కఠినంగా శిక్షించాలి
విశ్వంభర, మహబూబాబాద్ : ఖమ్మం పట్టణానికి చెందిన రజక కులానికి చెందిన ఓ మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిపి బిల్డింగ్ మీద నుండి కింద పడేసిన గౌస్ పాషాను తక్షణమే కఠినంగా శిక్షించాలి అని ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు కిషన్ నాయక్ కోరారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , గౌస్ బాషా పైన తక్షణమే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని , బాలికకు పూర్తిగా నాణ్యమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఆమెను ఆదుకోవాలని అన్నారు. ఖమ్మం జిల్లాలో అందరూ అగ్రకులాలా వారు ఉండడం వలన ఈ నిరుపేద మైనర్ బాలికకు అన్యాయం జరిగే అవకాశం ఉన్నదని , ఆ బాలికకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సదుపాయాలు అందించాలని , ఇప్పటికైనా ప్రజాస్వామ్యవాదులు , మేధావులు , తెలంగాణ ఉద్యమకారులు , వివిధ రాజకీయ పార్టీలు కలిసి రజక బిడ్డ మీద అన్యాయం జరిగిన విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధితురాలి కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని కిషన్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ కోరారు .


