కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసు కొట్టివేత

కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసు కొట్టివేత

విశ్వంభర. బొంరాస్ పేట్ : బొంరాస్ పేట్ మండల కేంద్రంలో 2018 ఎన్నికల సమయంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసు నమోదు అయింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామచంద్ర రెడ్డి ఇంటిపై పోలీసులు జరిపిన రైడింగ్ ను అడ్డుకున్నారనే అభియోగంతో నమోదు చేసిన కేసును కోడంగల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గురువారం విచారణ అనంతరం కొట్టివేశారు. దీంతో అక్రమంగా పెట్టిన కేసు కోర్టులో నిలవలేదని న్యాయం గెలిచిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు.

Tags: