తెలంగాణ ప్రజలకు బిజెపి ఎంపీ తేజస్వి సూర్య బహిరంగ క్షమాపణ చెప్పాలి : కాచం సత్యనారాయణ
తేజస్వి సూర్య వాక్యాలను నిరసిస్తూ ఎల్బి నగర్ లొ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
- తెలంగాణ రాష్టాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం తెలంగాణ అమరుల త్యాగాలను అవమానించడమే.
- తేజస్వి సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ ఎంపీ లు స్పందించకపోవడం దారుణం
- తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని అవమానించిన తేజస్వి సూర్య వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి.
- లేదంటే తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ ఎంపీల ఇండ్లను ముట్టడిస్తాం.
- తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కాచం సత్యనారాయణ హెచ్చరిక .
విశ్వంభర,హైదరాబాద్ : పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్, పాకిస్తాన్ విభజనతో పోల్చిన బిజెపి ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాచం సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎల్బీనగర్లోని శ్రీకాంతాచారి విగ్రహం నుండి ఎల్బీనగర్ చౌరస్తా వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా తేజస్వి సూర్య కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని అవమానించిన తేజస్వి సూర్య వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దశాబ్దాల పోరాటం వేలాదిమంది, యువత త్యాగాల ఫలితం గా రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన తెలంగాణ రాష్టాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం తెలంగాణ అమరుల త్యాగాలను అవమానిచడమేనని పేర్కొన్నారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజలను అవమానించేలా తేజస్వి సూర్య మాట్లాడుతుంటే తెలంగాణ బీజేపీ ఎంపీ లు స్పందించకపోవడం దారుణం అన్నారు. తెలంగాణ పై బీజేపీ ద్వంద వైఖరికి ఇది నిదర్శనం అన్నారు. 1.jpeg)
తెలంగాణ రాష్టం, తెలంగాణ అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిందన్నారు, అలాంటి తెలంగాణ ను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడిన ఊరుకునే ప్రసక్తే లేదని కాచం సత్యనారాయణ హెచ్చరించారు.ఇప్పటికైనా బీజేపీ అధిష్టానం, తెలంగాణ బీజేపీ ఎంపీలు స్పందించి వెంటనే తేజస్వి సూర్య తో క్షమాపణ చెప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యములోవేలాది మంది ఉద్యమకారులతో కలిసి తెలంగాణ బీజేపీ ఎంపీల ఇండ్ల ముట్టడి కార్యక్రమం చేపడుతామని పేర్కొన్నారు . ఈ కార్యక్రమం లో తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం నాయకులు రామ్ నరసింహ గౌడ్, బీరెల్లి వెంకట్ రెడ్డి,ఉప్పల శ్రవణ్ కుమార్, కొత్త రవి,కొండ శ్రీనివాస్, పిడికిలి రాజు,సల్వా చారి,శ్రీధర్,కృష్ణ గుప్తా,అరుణ్ గౌడ్,పద్మ కృష్ణ, డి. వెంకటేష్, మల్లేష్, శ్రవణ్ రెడ్డి, జగదీశ్,శ్రీరాములు, వెంకట్ రెడ్డి, బాలరాజు గౌడ్, అశోక్ చారి, పరమేశ్వర్, కొండల్, రామకృష్ణ రెడ్డి, ఎండీ జాహెద్, టీ. మోహన్,ఎన్ రమేష్, మల్లేష్,కొండయ్య, జగన్, పిల్లి వెంకటేష్, మల్లేష్ యాదవ్, హరిబాబు, యాదగిరి, పబ్బ శ్రీనివాస్ గౌడ్, పబ్బ శేఖర్ గౌడ్, రాములు, శివ కృష్ణ, శ్యామ్ సుందర్ రెడ్డి, వెంకటేష్ కుమార్, జయ శ్రీనివాస్ గౌడ్, వీరస్వామి, బాలస్వామి, సోమ శ్రీరాములు, మల్లేష్, శ్యామ్ సుందర్ గౌడ్, కార్తీక్ చారి, ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



