బాధిత కుటుంబానికి సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు
On
విశ్వంభర, కూకట్ పల్లి : పక్షవాతం తో బాధ పడుతున్న వ్యక్తి కి రూ.1.6 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ అందజేశారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో గంగాధర్ అనే వ్యక్తి కుమారుడు భరత్ గత కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నారు. రామ్ దేవ్ బాబా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వీరి కుటుంబ సభ్యులు వెంటనే గొట్టి ముక్కుల వెంకటేశ్వరరావు కార్యాలయంలో సంప్రదించగా వెంటనే ఒక లక్ష అరవై వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బండి రమేష్ చేతుల మీదుగా కుటుంబానికి అందించారు.



