అభివృద్ధిలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన బిఆర్ఎస్ 

అభివృద్ధిలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన బిఆర్ఎస్ 

విశ్వంభర, చింతపల్లి : అలుపెరగని పోరాటంతో రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గులాబీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు భారత రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గులాబీ జెండా తెలంగాణ ప్రజలకు కొండంత అండ అని ఆమె అన్నారు. బిఆర్ఎస్ పార్టి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు పని చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మర్రు రామారావు ఉలుపాల శేఖర్ రెడ్డి,ఉలుపాల పురుషోత్తం రెడ్డి, సిమర్ల శ్రీను యాదవ్,దాసరి తిరుపతయ్య,వీరమల్ల వెంకటయ్య,గంటెల ఆంజనేయులు,వార్డు సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి,మాదగోని కృష్ణ గౌడ్, రెడ్డి పద్మ పరమేష్,దాసరి కళమ్మ ముత్తయ్య, శివర్ల పర్వతాలు యాదవ్,బిఆర్ఎస్ నాయకులు రాశిక పాండయ్య, శివర్ల రాములు,మెరిక శంకరయ్య, శివర్ల ఆంజనేయులు,శివర్ల రమేష్,రాశిక శీరీష్,మర్రు జనార్థన్ రావు,మెండె రాములు,రాశిక గణేష్,సందె శంకర్,సందె పవన్,సందె మహేష్,సందె వెంకట్,జాహాంగీర్, మునగాల అశోక్,కలగోని కిరణ్, జక్కుల శాయిలు,మెరిక రాములు,సందె చంద్రయ్య,బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు,తదితరులు పాల్గొన్నారు.

Tags: