రెండేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది
- ఎమ్మెల్యే మల్లారెడ్డి
విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా పోచారం చౌదరిగుడాలో చెరుకు బాలయ్య గార్డెన్ లో పోచారం మాజీ కౌన్సిలర్ బద్దం మమతా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మహిళా దినోత్సవం కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి , ఏమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఏమ్మెల్యే కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పనికిరాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందని వచ్చే రెండేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ కెసిఆర్ నెరవేరుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మాజీ మేయర్ జక్కా వెంకట్రెడ్డి డాక్టర్ భద్రారెడ్డి డాక్టర్ ప్రీతి రెడ్డి ,మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, బి ఆర్ ఆర్ పార్టీ నాయకులు, మహిళలు , కార్యకర్తలు, మాజీ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. చీరల విషయంలో కొందరు మహిళలకు చీరలు అందకపోవడంతో ఆందోళన చేయడంతో కొద్దిగా రసాభాస జరిగింది.



