ఫైర్ సేఫ్టీ ఫై విద్యార్థులకు అవగాహన
విశ్వంభర, మహబూబాబాద్: కురవి మండలం నేరడ ఆదర్శ పాఠశాల కళాశాల విద్యార్థులకు మహబూబాబాద్ జిల్లా ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర అగ్నిమాపక డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందం బృందంతో ఫైర్ సేఫ్టీ పై అవగాహన సదస్సు నిర్వహించారు . అగ్ని ప్రమాద సమయంలో ఎలా వ్యవహరించాలో మాక్ డ్రిల్ ప్రదర్శన ద్వారా విద్యార్థులకు కళ్లకు కట్టినట్టు చూపించారు . పరికరాలపై వివరించారు . ఈ సందర్భంగారాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ స్టేట్ అబ్జర్వర్ అడిషనల్ డైరెక్టర్ సండ్రా ,భద్రాద్రి శ్రీ రాములు, జిల్లా అగ్నిమాపక అధికారి సంక్రాంతి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే అగ్ని ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండడంతో ప్రమాదాలు జరిగినప్పుడు నివారణకు ఉపయోగపడుతుందన్నారు . ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ, నేరడ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ . వై . శ్రీకాంత్, స్కూల్ అధ్యాపక బృందం , కేజీబీవీఎస్ సరస్వతి,జడ్.పి.హెచ్.ఎస్ హెచ్ఎం సాయిల్, పాల్గొన్నారు .



