సోమాజిగూడ యశోదలో అత్యాధునిక ‘గ్యాస్ట్రో’ చికిత్సలు.-డాక్టర్‌ పెద్ది కిరణ్‌ వెల్లడి.

సోమాజిగూడ యశోదలో అత్యాధునిక ‘గ్యాస్ట్రో’ చికిత్సలు.-డాక్టర్‌ పెద్ది కిరణ్‌ వెల్లడి.

విశ్వంభర హనుమకొండ జిల్లా:- హనుమకొండ లోనీ యశోద హాస్పిటల్ లో డాక్టర్ పెద్ది కిరణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మాట్లాడుతూ జీర్ణవ్యవస్థ,  కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడే రోగులకు అంతర్జాతీయ స్థాయి వైద్యం ఇక సామాన్యులకు కూడా చేరువలో ఉందని సోమాజిగూడ యశోద హాస్పిటల్స్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం వెల్లడించింది. అత్యాధునిక మౌలిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన నిపుణులతో ఈ విభాగం ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనే అగ్రగామి కేంద్రంగా సేవలందిస్తోందని డాక్టర్‌ పెద్ది కిరణ్‌ పేర్కొన్నారు. రోగులకు సత్వరమే ఖచ్చితమైన వ్యాధి నిర్ధారణ చేసేందుకు వీలుగా హై-డెఫినిషన్ ఇమేజింగ్ సిస్టమ్లతో కూడిన అత్యాధునిక ఎండోస్కోపీ సూట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. 24 గంటల అత్యవసర సేవలు, అడ్వాన్స్‌డ్ ICU సపోర్ట్‌తో పాటు CT, MRI, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ వంటి హై-ఎండ్ డయాగ్నోస్టిక్ సేవలు ఒకే చోట లభిస్తాయి. రోగులకు సమయం వృథా కాకుండా బ్లడ్ బ్యాంక్ ,రౌండ్-ద-క్లాక్ ఫార్మసీ సేవలను కూడా ఆసుపత్రి సమకూరుస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన గ్యాస్ట్రోఎంటరాలజిస్టుల పర్యవేక్షణలో ఇక్కడ చికిత్సలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎసిడిటీ, రిఫ్లక్స్, దీర్ఘకాలిక కడుపు నొప్పి, అజీర్ణం, IBS.కాలేయ వ్యాధులు: ఫ్యాటీ లివర్, హెపటైటిస్, సిర్రోసిస్, లివర్ ఫెయిల్యూర్.అధునాతన పరీక్షలు: అప్పర్ GI ఎండోస్కోపీ, కొలొనోస్కోపీ ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించడం. ప్యాంక్రియాటైటిస్, జీర్ణాశయ రక్తస్రావం, ఉదర క్షయ వంటి క్లిష్ట సమస్యలకు పరిష్కారం.కేవలం చికిత్స మాత్రమే కాదు.. జీవనశైలిలో మార్పు.."కేవలం మందులతోనే కాకుండా, రోగి సంరక్షణలో భాగంగా ఆహార నియమాలు, జీవనశైలి మార్పులు,నివారణ చర్యలకు మేము అత్యంత ప్రాధాన్యత ఇస్తాం" అని డాక్టర్‌ పెద్ది కిరణ్‌ తెలిపారు. అత్యాధునిక ఎండోస్కోపీ యూనిట్ ద్వారా కోత లేని (మినిమల్లీ ఇన్వేసివ్) చికిత్సలు అందించడం వల్ల రోగులు త్వరగా కోలుకునే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.జీర్ణకోశ సమస్యలతో బాధపడేవారు నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే నిపుణులను సంప్రదించడం ద్వారా దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడవచ్చని వారు సూచించారు.

Tags: