నాటుసారా స్థావరాలపై  దాడులు 

నాటుసారా స్థావరాలపై  దాడులు 


విశ్వంబర, మహబూబాబాద్:  మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోనీ  అనంతారం  పెద్ద తండా, సిరోలు మండలంలోని  తాళ్ల సంకీసా , వశ్రాo తండా , మన్నెగూడెం, కొత్త తండాలలో సారాయి స్థావరాలపై  మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పోలీసులు దాడులు నిర్వహించారు . ఈ సందర్భంగా మహబూబాబాద్ ఎక్సైజ్  సిఐ చిరంజీవి  మాట్లాడుతూ  దాడుల్లో  ఐదుగురిని అదుపులో కి తీసుకుని వారి పై  కేసులు నమోదు చేసినట్లు తెలిపారు . 19  లీటర్ల సారాయి, 50  కిలోల బెల్లం,30 కిలోల పటిక స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 600 లీటర్ల  బెల్లం పానకం ధ్వంసం చేశామని , ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే  శిక్ష తప్పదని  ఆయన అన్నారు.  దాడుల్లో    అశోక్ కుమార్, బాలరాజు, శిరీష, వెంకన్న, నరసింహారావు, ఇబ్రహీం, శ్రీనివాస్,రాజ్ కుమార్ పాల్గొన్నారు .

Tags: