ఏఐ ఆవిష్కరణలకు తెలంగాణ వేదిక: మంత్రి శ్రీధర్ బాబు

ఏఐ ఆవిష్కరణలకు తెలంగాణ వేదిక: మంత్రి శ్రీధర్ బాబు

 కృత్రిమ మేధ (ఏఐ) ఆవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రం ఒక ప్రధాన వేదికగా నిలుస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. 

విశ్వంభర, నేషనల్ బ్యూరో: కృత్రిమ మేధ (ఏఐ) ఆవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రం ఒక ప్రధాన వేదికగా నిలుస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు ఐటీ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న ఏఐ సమ్మిట్‌లో పాల్గొన్న మంత్రి.. అమెరికా, ఇండియా వాణిజ్య మండలి ప్రతినిధులతో ప్రత్యేక చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. 'అమెరికా టెక్‌ దిగ్గజాలతో కలిసి పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానాన్ని ప్రోత్సహిస్తున్నాం. మా ప్రభుత్వ స్థిరమైన విధానాల వల్ల ఏఐ పరిశోధనలకు రాష్ట్రం వేదికగా మారింది. ప్రజాసేవల్లోనూ ఏఐ ద్వారా సమస్యలను వేగంగా పరిష్కరిస్తున్నాం' అని శ్రీధర్‌బాబు వివరించారు. రాష్ట్రంలోని స్థిరమైన విధానాలు, పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం వల్ల ఐటీ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ ఉత్తమ అవకాశాలను కల్పిస్తోందని మంత్రి ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ఏఐ పర్యావరణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

Read More అక్రిడిటేష‌న్‌, మీడియా కార్డుల‌కు ఎలాంటి తేడా లేదు, ఆందోళ‌న వ‌ద్దు, మీతో నేనున్నా