ఆర్చరీ పోటీలో వి. జోషిత ప్రతిభ
On
విశ్వంభర, హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్లో నిర్వహించిన ఎన్టిపిసి నేషనల్ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంట్లో హైదరాబాదు కొండాపూర్ మహర్షి విద్యా మందిర్ పాఠశాల 10వ తరగతి విద్యార్థిని వి. జోషిత ప్రతిభ కనబర్చింది. కంపౌండ్ ఆర్చరీ విభాగంలో అద్భుత ప్రదర్శనతో తెలంగాణకు గౌరవం తీసుకువచ్చింది. మార్చి 7 నుంచి 15 వరకు జరిగిన పోటీల్లో జూనియర్ విభాగంలో స్వర్ణ పతకం, సబ్ జూనియర్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. జాతీయ స్థాయి ఎంపికలకు అర్హత సాధించేందుకు ఈ టోర్నమెంట్ ముఖ్యమైన ర్యాంకింగ్ ఈవెంట్గా నిర్వహించారు. కొంపల్లిలోని అరుణ్ ఆర్చరీ అకాడమీలో కోచ్ అరుణ్ కుమార్ మార్గదర్శకత్వంలో శిక్షణ పొందుతోంది. ఆమె విజయం పట్ల కోచ్తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.



