బెంగాల్లో అల్లర్లు.. బీజేపీ అభ్యర్థిపై దాడికి యత్నం..!
సార్వత్రిక ఎన్నికల ఆరో దశ పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఝర్గ్రామ్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ప్రణత్ తుడుపై తృణమూల్ కాంగ్రెస్ వర్గీయులు దాడికి ప్రయత్నించారు.
వెస్ట్ మిడ్నాపూర్ జిల్లాలోని గార్బేట ప్రాంతంలో ఆయన కాన్వాయ్పై దాడికి యత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది ఆయనను తప్పించారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కొన్ని పోలింగ్ బూత్లలోకి బీజేపీ ఏజెంట్లను అనుమతించడం లేదని ఫిర్యాదులు రావడంతో తుడు గార్బేటకు బయలుదేరారు. ఇక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దింపారు. కాగా, బీజేపీ ఆరోపణలను స్థానిక టీఎంసీ నాయకులు ఖండించారు. పోలింగ్ ప్రక్రియ శాంతియుతంగా కొనసాగుతుండగా బీజేపీ అభ్యర్థి ఇబ్బందులు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
Okay, violence enters #jhargram too #loksabhaelections2024https://t.co/4RDpM5oGaq
— Tushar (@tushar_cal) May 25, 2024