దారి దోపిడీ ముఠా అరెస్టు
విశ్వంభర, నల్లకుంట : దారి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాదు నల్లకుంట పోలీసులు అరెస్టు చేయగా, ఒక మైనర్ను జువైనల్ హోంకు తరలించారు. నిందితుల వద్ద నుంచి రెండు యాక్టివా ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఓయూ ఏసీపీ జి. జగన్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి బస్టాప్ వద్ద బస్సు కోసం వేచి ఉన్న వ్యక్తిని బ్లేడ్తో బెదిరించి నగదు, సెల్ఫోన్ దోచుకున్న నిందితులు అనంతరం ఓ పెట్రోల్ బంక్లో సిబ్బందిని బెదిరించి పెట్రోలు నింపించుకుని డబ్బులు చెల్లించకుండా పరారయ్యారు. నమోదైన కేసులపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాచిగూడకు చెందిన ఫర్దీన్ అలియాస్ నజ్జు, బజ్జలోలు కళ్యాణ్ అలియాస్ సాయి కళ్యాణ్ను అరెస్టు చేశారు. ఒక మైనర్ను అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు. నిందితులపై గతంలో కూడా పలు దోపిడీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
దారి దోపిడీ ముఠా అరెస్టు
విశ్వంభర, నల్లకుంట : దారి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను హైదరాబాదు నల్లకుంట పోలీసులు అరెస్టు చేయగా, ఒక మైనర్ను జువైనల్ హోంకు తరలించారు. నిందితుల వద్ద నుంచి రెండు యాక్టివా ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఓయూ ఏసీపీ జి. జగన్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి బస్టాప్ వద్ద బస్సు కోసం వేచి ఉన్న వ్యక్తిని బ్లేడ్తో బెదిరించి నగదు, సెల్ఫోన్ దోచుకున్న నిందితులు అనంతరం ఓ పెట్రోల్ బంక్లో సిబ్బందిని బెదిరించి పెట్రోలు నింపించుకుని డబ్బులు చెల్లించకుండా పరారయ్యారు. నమోదైన కేసులపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాచిగూడకు చెందిన ఫర్దీన్ అలియాస్ నజ్జు, బజ్జలోలు కళ్యాణ్ అలియాస్ సాయి కళ్యాణ్ను అరెస్టు చేశారు. ఒక మైనర్ను అదుపులోకి తీసుకుని జువైనల్ హోంకు తరలించారు. నిందితులపై గతంలో కూడా పలు దోపిడీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.


