హుస్నాబాద్ లో నూతన డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభం
విశ్వంభర, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని నెహ్రూ చౌరస్తాలో రాజమహేంద్ర డయోగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజుల రెడ్డి , వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ రవీందర్ హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడం కోసం అత్యాధునిక సేవల ద్వారా మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటు ధరలలో కచ్చితత్వంతో,తక్కువ ఖర్చులతో రక్త పరీక్షలు చేయడమే లక్ష్యంగా రాజమహేంద్ర డయాగ్నొస్టిక్ ల్యాబ్ ప్రారంభించామని నిర్వాహకులు రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గాదపాక రవీందర్, బత్తుల స్వరూప రవీందర్ వాలా సుప్రజ నవీన్ రావు సైదాపూర్ మాజీ సర్పంచ్ చంద శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు ఐలేని మల్లికార్జున్ రెడ్డి, పెరమండ్ల నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్ లో నూతన డయాగ్నొస్టిక్ సెంటర్ ప్రారంభం
విశ్వంభర, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కేంద్రంలోని నెహ్రూ చౌరస్తాలో రాజమహేంద్ర డయోగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజుల రెడ్డి , వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ రవీందర్ హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడం కోసం అత్యాధునిక సేవల ద్వారా మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రజలకు అందుబాటు ధరలలో కచ్చితత్వంతో,తక్కువ ఖర్చులతో రక్త పరీక్షలు చేయడమే లక్ష్యంగా రాజమహేంద్ర డయాగ్నొస్టిక్ ల్యాబ్ ప్రారంభించామని నిర్వాహకులు రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గాదపాక రవీందర్, బత్తుల స్వరూప రవీందర్ వాలా సుప్రజ నవీన్ రావు సైదాపూర్ మాజీ సర్పంచ్ చంద శ్రీనివాస్, బిఆర్ఎస్ నాయకులు ఐలేని మల్లికార్జున్ రెడ్డి, పెరమండ్ల నర్సాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


