రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య 

రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య 

 విశ్వంభర,  ఘట్కేసర్: వరంగల్ జిల్లా పాపయ్యపేటకు చెందిన రవికుమార్, శిరీష  దంపతులు మేడ్చల్ జిల్లా  ఘట్కేసర్  సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. దంపతుల మృతితో పాపయ్యపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

🕒 04 Jul 2026 ✍️ Desk

రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య 

 విశ్వంభర,  ఘట్కేసర్: వరంగల్ జిల్లా పాపయ్యపేటకు చెందిన రవికుమార్, శిరీష  దంపతులు మేడ్చల్ జిల్లా  ఘట్కేసర్  సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. దంపతుల మృతితో పాపయ్యపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

🔗 https://www.vishvambhara.com/crime/couple-committed-suicide-after-being-hit-by-a-train/article-17912

Tags: