ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు
On
విశ్వంభర, పరిగి: మండల పరిధిలోని చిగురాల్ పల్లి గ్రామంలో పొలాల వద్ద ఉన్న 63 కెవి ట్రాన్స్ఫార్మర్ పాడయిపోవడంతో ఆ విషయాన్ని రైతులు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి విద్యుత్ అధికారులతో మాట్లాడి 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడంతో రైతులు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తాజుద్దీన్, రాజు, పండరయ్య, వడ్ల చారి, తిరుపతయ్య, మల్లేశం, సలీం, తదితరులు పాల్గొన్నారు.



