చట్టాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. - సీనియర్ సివిల్ జడ్జ్ శాలిని .
ముగిసిన పారా లీగల్ వాలంటీర్ల శిక్షణ శిబిరం .
On
విశ్వంభర, మహబూబాబాద్ : తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో 50 మంది పారా లీగల్ వాలంటీర్లకు రెండు రోజుల శిక్షణ తరగతులను నిర్వహించారు . ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి జడ్జ్ శాలిని మాట్లాడుతూ చట్టాలను , ప్రజల్లోకి , గ్రామాల్లోకి, తీసుకెళ్లాలని, వారిలో న్యాయ చైతన్యం కలిగించాలని చట్టాలపై అవగాహన లేని ప్రతి వ్యక్తి కూడా న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించే విధంగా వారిని ప్రోత్సహించాలని , అందువల్ల వారిలో న్యాయ చైతన్యం పెరుగుతుందని అన్నారు .శిక్షణ తరగతుల నిర్వహణలో భాగంగా ఈరోజు సిడబ్ల్యుసి చైర్పర్సన్ డాక్టర్ నాగవాణి , ప్రభుత్వ న్యాయవాది తోరణాల నగేష్ కుమార్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అయిన దాసరి నాగేశ్వరరావు, న్యాయవాదులు కమలకుమార్, విశ్వ, మొదలైన వారు వాలంటీర్లకు వివిధ రకాలైనటువంటి చట్టాల పైన అవగాహన కలిగించడం జరిగింది. ఈ ముగింపు కార్యక్రమాల్లో భాగంగా వాలంటీర్లకు, పబ్లిసిటీ మెటీరియల్ పంచి చట్టాల పైన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు .



