కోడిపందేల నిర్వాహకులు అరెస్ట్
On
విశ్వంభర, తొర్రూరు: మండలంలోని గుంటూరు గ్రామ శివారులో కోడిపందే ల నిర్వాహకులను అరెస్టు చేసినట్లు ఎస్సై ఉపేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సై వెల్లడించిన వివరాల ప్రకారం, మంగళ వారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో గుర్తూరు గ్రామ శివారులో గల మామిడి తోటలో కోడిపందాలను నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు దాడి చేయగా కోడి పందాలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులతో పాటు 65,400 రూపాయలు ,17 కోళ్లు , 4 సెల్ ఫోన్లు, 3 మోటర్ సైకిల్లు, ఒక బొలెరో వాహనం ను సీజ్ చేసి నాట్లు పేర్కొన్నారు. కోడి పందేల నిర్వాహకులు గుంజ వెంకటేష్, అల్లం హుస్సేన్, అల్లం ప్రసాద్ , కిన్నెరసారయ్య లను అరెస్టు చేసినట్లు తెలిపారు. మరి కొంతమంది పరారీలో ఉన్నారని తెలిపారు.



