తడక రమేష్ కు జాతీయ ఉత్తమ చైర్మన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. -జాతీయ స్థాయిలో పోచంపల్లి బ్యాంక్ కు మూడు పురస్కారాలు.
- ఉత్తమ అర్బన్ కో -ఆపరేటివ్ బ్యాంకు.
- ఉత్తమ చైర్మన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తడక రమేష్.
- ఉత్తమ ఎన్ పి ఏ మేనేజ్ మెంట్.
విశ్వంభర, ఉత్తరప్రదేశ్ / లక్నో :- జాతీయ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల సమ్మేళనం -2026 కార్యక్రమం జూన్ 5, 2026 నుండి జూన్ 7. 2026 వరకు లక్నో పట్టణంలో అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భారత్ రత్న సహకారిత సమ్మాన్-2026 నకు సంబంధించిన ప్రతిష్టాత్మకమైన అవార్డుల ప్రధానోత్సవంలో పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నకు మూడు అరుదైన పురస్కారాలు వరించాయి. ఉత్తమ అర్బన్ కో -ఆపరేటివ్ బ్యాంకు , ఉత్తమ చైర్మన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తడక రమేష్, ఉత్తమ ఎన్ పి ఏ మేనేజ్ మెంట్ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ అవార్డులను లక్నో ఎమ్మెల్యే పుకాన్ చేతుల మీదుగా బ్యాంకు చైర్మన్ తడక రమేష్, సి.ఇ.ఓ సీత శ్రీనివాస్ లు అవార్డ్స్ ను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్, డైరెక్టర్లు కర్నాటి బాలసుబ్రమణ్యం, ఏలె హరిశంకర్, సూరిపల్లి రమేష్, రాపోలు వేణు, గుండు కొవ్వు, కర్నాటి భార్గవి, బిట్టు భాస్కర్, మక్తాల నర్సింహ పాల్గొన్నారు. బ్యాంకు దినదినాభివృద్ది చెందుతూ ప్రతి సంవత్సరం అవార్డులను గెలుపొందటం పట్ల ఖాతాదారులు, వాటాదారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
తడక రమేష్ కు జాతీయ ఉత్తమ చైర్మన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. -జాతీయ స్థాయిలో పోచంపల్లి బ్యాంక్ కు మూడు పురస్కారాలు.
విశ్వంభర, ఉత్తరప్రదేశ్ / లక్నో :- జాతీయ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల సమ్మేళనం -2026 కార్యక్రమం జూన్ 5, 2026 నుండి జూన్ 7. 2026 వరకు లక్నో పట్టణంలో అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భారత్ రత్న సహకారిత సమ్మాన్-2026 నకు సంబంధించిన ప్రతిష్టాత్మకమైన అవార్డుల ప్రధానోత్సవంలో పోచంపల్లి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నకు మూడు అరుదైన పురస్కారాలు వరించాయి. ఉత్తమ అర్బన్ కో -ఆపరేటివ్ బ్యాంకు , ఉత్తమ చైర్మన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు తడక రమేష్, ఉత్తమ ఎన్ పి ఏ మేనేజ్ మెంట్ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ అవార్డులను లక్నో ఎమ్మెల్యే పుకాన్ చేతుల మీదుగా బ్యాంకు చైర్మన్ తడక రమేష్, సి.ఇ.ఓ సీత శ్రీనివాస్ లు అవార్డ్స్ ను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్, డైరెక్టర్లు కర్నాటి బాలసుబ్రమణ్యం, ఏలె హరిశంకర్, సూరిపల్లి రమేష్, రాపోలు వేణు, గుండు కొవ్వు, కర్నాటి భార్గవి, బిట్టు భాస్కర్, మక్తాల నర్సింహ పాల్గొన్నారు. బ్యాంకు దినదినాభివృద్ది చెందుతూ ప్రతి సంవత్సరం అవార్డులను గెలుపొందటం పట్ల ఖాతాదారులు, వాటాదారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.


