వివాహిత మహిళ అనుమానాస్పద మృతి
విశ్వంభర, నెల్లికుదురు: అనుమానాస్పద స్థితిలో వివాహిత మహిళ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి లో చోటుచేసుకుంది. ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం బ్రాహ్మణ కొత్తపెల్లి కి చెందిన జల్ల కృష్ణవేణి(32) జల్ల పరుశరాములు భార్య భర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య భర్తల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కృష్ణవేణి శుక్రవారం ఉదయం ఇంటి వద్ద ఉరి వేసుకుని చనిపోయి ఉంది. మృతురాలి తల్లి పార్నంది ప్రమీల తన కూతురు కృష్ణవేణి మరణం పై అనుమానం వ్యక్తం చేస్తూ ఉరివేసుకొని చనిపోయిందో, లేక కృష్ణవేణి భర్త పరశురాములు కృష్ణవేణిని చంపి ఉరివేసినాడో అనుమానంగా ఉందని పోలీసులకు పిటిషన్ ఇచ్చినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.
వివాహిత మహిళ అనుమానాస్పద మృతి
విశ్వంభర, నెల్లికుదురు: అనుమానాస్పద స్థితిలో వివాహిత మహిళ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లి లో చోటుచేసుకుంది. ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం బ్రాహ్మణ కొత్తపెల్లి కి చెందిన జల్ల కృష్ణవేణి(32) జల్ల పరుశరాములు భార్య భర్తలు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య భర్తల మధ్య గత కొన్ని సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కృష్ణవేణి శుక్రవారం ఉదయం ఇంటి వద్ద ఉరి వేసుకుని చనిపోయి ఉంది. మృతురాలి తల్లి పార్నంది ప్రమీల తన కూతురు కృష్ణవేణి మరణం పై అనుమానం వ్యక్తం చేస్తూ ఉరివేసుకొని చనిపోయిందో, లేక కృష్ణవేణి భర్త పరశురాములు కృష్ణవేణిని చంపి ఉరివేసినాడో అనుమానంగా ఉందని పోలీసులకు పిటిషన్ ఇచ్చినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.


