గ్రామాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యం
విశ్వంభర, మహేశ్వరం : కందుకూరు మండలం బాచుపల్లి గ్రామానికి మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే కే ఎల్ ఆర్ సహకారంతో గ్రామ సర్పంచ్ సబితా యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కి పది లక్షల రూపాయలతో అండర్ డ్రైనేజ్ పనులు మొదలుపెట్టడం జరిగింది, సర్పంచ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనుల గురించి తెలియజేశారు, బాచుపల్లి గ్రామంలో కె.ఎల్.ఆర్ సహకారంతో గ్రామంలో నూతనంగా బోరు, అండర్ డ్రైనేజ్ , రోడ్లు అభివృద్ధి పనులు వస్తున్నాయని ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో లో ఉన్నాయి కాబట్టి, ఆ సమస్యలు కూడా కేఎల్ఆర్ దృష్టికి తీసుకువెళ్లి గ్రామాన్ని అభివృద్ధి చేయడమై నా లక్ష్యం అని సర్పంచ్ సబితా యోగేందర్ రెడ్డి తెలిపారు, అలాగే గ్రామస్తులు కే ఎల్ ఆర్ గ్రామానికి అండర్ డ్రైనేజ్ పనుల గురించి పది లక్షలు సాంక్షన్ చేసినందుకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేష్, వార్డ్ మెంబర్లు ఎర్ర ప్రమీల, అనిత, రాజు, నరసింహ, కృష్ణ, మానస, శాంతమ్మ, గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, గ్రామ ప్రజలు శ్రీశైలం, శ్రీనివాస్, శ్రీశైలం, జంగయ్య, కృష్ణయ్య, మహేందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



