కొండపోచమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే 

కొండపోచమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే 

 విశ్వంభర, పటాన్ చెరు : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూరు గ్రామంలో గల  కొండపోచమ్మ దేవాలయంలో మంగళవారం నిర్వహించిన జాతర మహోత్సవంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, గ్రామ పుర ప్రముఖులు, సీనియర్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags: