మెరిసిన బీసీ విద్యార్థులు.. గురుకులాలకు మంత్రి పొన్నం హామీ 

మెరిసిన బీసీ విద్యార్థులు.. గురుకులాలకు మంత్రి పొన్నం హామీ 

ఎంసెట్ ఫలితాల్లో బీసీ గురుకులాలు మంచి ఫలితాలు సాధించడంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతోనే గురుకులాలు పనిచేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు ఇలా మంచి ఫలితాలు రాబడితే.. ప్రభుత్వం తరుఫు నుంచి మరింత సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఎంసెట్ ఫలితాల్లో స్ఫూర్తి అనే బీసీ విద్యార్థిని 369వ ర్యాంక్ సాధించింది. దీనిపై పొన్నం ప్రభాకర్ ఆనందం వ్యక్తం చేశారు. సూర్తిని స్పూర్తిగా తీసుకొని మరింత మంది విద్యార్థులు కష్టపడాలని సూచించారు. 

Read More Sr జర్నలిస్ట్ , విశ్వంభర దినపత్రిక బ్యూరో పోతుగంటి వెంకటరమణ కు  ఆహ్వానం 

 

స్పూర్తి మాత్రమే కాదు.. ఈ సారి ఎంసెట్ ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థుల మంచి ఫలితాలు రాబట్టారు. అగ్రికల్చర్ విభాగంలో 145 మంది బాలికలు పరీక్ష రాయగా 114 మంది అర్హత సాధించారు. ఐదువేల లోపు ర్యాంకర్లు 12 మంది, పదివేల లోపు ర్యాంక్ లు 29 మంది బాలికలు ఉన్నారు. ఇక ఇంజనీరింగ్ విభాగంలో 276 మంది బాలికలు పరీక్ష రాయగా 191 మంది అర్హత సాధించారు. వారిలో ఇద్దరికి పదివేల లోపు ర్యాంక్స్ వచ్చాయి. ఇక 135 మంది బాలురు పరీక్ష రాయగా 107 మంది క్వాలిఫై అయ్యారు. వారిలో 5 మంది బాలురు పదివేల లోపు ర్యాంక్‌లు సాధించారు.  

 

వచ్చే ఏడాది మరిన్ని ర్యాంక్‌లు సాధించాలని విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందించడానికి ప్రభుత్వ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. బీసీ విద్యార్థులు కష్టపడి మంచి స్థాయిలో ఉన్నపుడే మహ్మాతా జ్యోతి బా పూలే ఆకాంక్షలు నిజమవుతాయని ఆయన చెప్పారు.

Advertisement

LatestNews

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం - ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన
చండూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం - డా. కోడి శ్రీనివాసులు సహకారంతో పేద ప్రజలకు వైద్య సేవలు 
ఘనంగా చండూర్ లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ - -ఆవిష్కరించిన  మున్సిపల్ అధ్యక్షులు కొత్తపాటి సతీష్ 
మంత్రిని కలిసిన పోచంపల్లి బ్యాంక్ చైర్మన్ , వైస్ చైర్మన్  - పోచంపల్లి బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానం 
జగ్గారెడ్డి కుమార్తె నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
అన్యాయాన్ని  ప్రశ్నించే వారే కదలాలి - -బి ఎస్ రాములు సామాజిక తత్వవేత్త. బీసీ కమిషన్ తొలి చైర్మన్. 
AIPSO ఆధ్వర్యంలో పహల్గాం మృతులకు నివాళులు