ఆలయ నిర్మాణానికి  శంకుస్థాపన 

ఆలయ నిర్మాణానికి  శంకుస్థాపన 

విశ్వంభర, మహబూబాబాద్ : మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు రామచంద్రపురం కాలనీలో గురువారం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ నిర్మాణంకు మహబూబాబాద్  శాసనసభ్యులు డాక్టర్ భూక్యా మురళి నాయక్ శంకుస్థాపన చేశారు . అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ,  కాలనీవాసులు సుఖసంతోషాలతోనూ ఆనందంగా ఉండాలని దేవుని ప్రార్థించారు. వార్డ్ కౌన్సిలర్ల  ఆధ్వర్యంలో జరిగిన శంకుస్థాపనలో పూజారులు నవధాన్యాలు వేసి పూజా కార్యక్రమాలు చేశారు . ఈ కార్యక్రమంలో  మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత, దేవాలయ  చైర్మన్ సోమ రాంబాబు ,  గౌరవ అధ్యక్షులు బోళ్ల మల్లారెడ్డి ,  వార్డు కౌన్సిలర్లు , వార్డు ప్రజలు పాల్గొన్నారు .

Tags: