ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
On
విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి కుమార్ (25) అనే వ్యక్తి ఆర్థిక ఇబ్బందులతో గురువారం చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఘట్కేసర్ లో పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.



