ఎస్ఐఆర్లో ఫారమ్లు సకాలంలో సమర్పించాలి
విశ్వంభర, అంబర్పేట : ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారమ్లను సకాలంలో సమర్పించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ అన్నారు. హైదరాబాదు బాగ్ అంబర్పేట డివిజన్ మల్లికార్జున్నగర్ కమ్యూనిటీ హాల్లో ఖైరతాబాద్ డీసీసీ ఉపాధ్యక్షురాలు ఆర్. సునీతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఐఆర్ హెల్ప్డెస్క్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓటర్లకు ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, అవసరమైన ఫారమ్లను గడువులోగా సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో: బాగ్ అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు రావుల సుధాకర్, సంతోష్ గుప్తా, మహేష్ గౌడ్, లావణ్య, పద్మ, మౌనిక, తంగావేలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
ఎస్ఐఆర్లో ఫారమ్లు సకాలంలో సమర్పించాలి
విశ్వంభర, అంబర్పేట : ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారమ్లను సకాలంలో సమర్పించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ అన్నారు. హైదరాబాదు బాగ్ అంబర్పేట డివిజన్ మల్లికార్జున్నగర్ కమ్యూనిటీ హాల్లో ఖైరతాబాద్ డీసీసీ ఉపాధ్యక్షురాలు ఆర్. సునీతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఐఆర్ హెల్ప్డెస్క్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓటర్లకు ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ, అవసరమైన ఫారమ్లను గడువులోగా సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో: బాగ్ అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు రావుల సుధాకర్, సంతోష్ గుప్తా, మహేష్ గౌడ్, లావణ్య, పద్మ, మౌనిక, తంగావేలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.


