చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది
:మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్
విశ్వంభర ,తొర్రూరు: చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది అని తూనం శ్రావణ్ కుమార్ అన్నారు. సోమవారం తొర్రూర్ పట్టణంలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తునం శ్రవణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజినీరాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ వక్కల శ్యాంసుందర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నులిపురుగుల నిర్మూలన సందర్భంగా ఆల్బెండజోన్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, ఆరోగ్య నియమాలను అలవర్చు కోవాలని సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణకు మున్సిపాలిటీ తరఫున ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది
విశ్వంభర ,తొర్రూరు: చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది అని తూనం శ్రావణ్ కుమార్ అన్నారు. సోమవారం తొర్రూర్ పట్టణంలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తునం శ్రవణ్, మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజినీరాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ వక్కల శ్యాంసుందర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నులిపురుగుల నిర్మూలన సందర్భంగా ఆల్బెండజోన్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తుకు పునాది అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని, ఆరోగ్య నియమాలను అలవర్చు కోవాలని సూచించారు. ప్రజారోగ్య పరిరక్షణకు మున్సిపాలిటీ తరఫున ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


